విశాఖలో నేవీ సిబ్బంది ఘాతుకం.. హైదరాబాద్లో తల్లిని చంపిన మైనర్ కూతురు!
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దిగ్భ్రాంతికర హత్య ఉదంతాలు సామాన్య ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులే కాలయముళ్లుగా మారుతున్న ఘటనలు సమాజంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక నావికాదళ సిబ్బంది వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ముక్కలుగా నరికిన ఘటన మరువకముందే, హైదరాబాద్లో సొంత తల్లిని మైనర్ కూతురు ప్రియుడితో కలిసి అంతమొందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు వివరాలు ఇవీ.. విశాఖపట్నం ఘటన: నేవీ సిబ్బంది…
