వరంగల్ /హన్మకొండ : వరంగల్/హన్మకొండ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. (Sub registrar suspended) ఈ ఉత్వర్వులు సోమవారం(నేడు) వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘ఘంటారావమ్’ వరుస కథనాలు అందించిన విషయం పాఠకులకు తెలిసిందే.
ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్/హన్మకొండ (వడ్డేపల్లి) ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ ఆస్తులను గుర్తించారు. అవినీతికిపాల్పడినందుకుగాను సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. రామనర్సింహారావుపై చర్యల కోసం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుభాషిణి కమిషనర్ కు సమర్పించారు
ఆయనపై ఈ నెల 10న చర్యలు తీసుకున్నారు. కానీ సెలవులు రావడంతో ఉత్తర్వులు ఇంకా వరంగల్ కార్యాలయానికి అందలేదు. వరంగల్/హన్మకొండ ఆర్వో కార్యాలయంలో ఏక కాలంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడటం, అక్రమ ఆస్తులు కలిగి ఉండటం సంచలనం కలిగించింది. రామనర్సింహారావు, ఆనంద్ మధ్య ఆన్లైన్లో రూ.43 లక్షల లావాదేవీలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించిన విషయం తెలిసిందే.
